మళ్లీ నిర్మాతగా బండ్లగణేష్.. ఈ సారి ఏ హీరోతో అంటే..?
ఇప్పుడు మళ్లీ నటుడిగా మారాడు గణేష్. అయితే నటుడుగా రీఎంట్రీ ఇస్తున్న ఈ టైమ్ లో ఏం అనిపించిందో ఏమో ...మళ్లీ నిర్మాతగా సినిమా మొదలెడుతున్నాడు. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన ప్రొడక్షన్ హౌస్ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఓ ప్రక్క నటన, మరో ప్రక్కన నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యారట.
నటుడిగా తెలుగు పరిశ్రమలో ఇరవై ఏళ్లుగా ఉన్నా రాని గుర్తింపు నిర్మాతగా కేవలం ఐదారేళ్లలో తెచ్చుకున్నాడు ఈయన. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా వెలిగాడు. హీరోలను ఓ రేంజిలో పొగిడి స్టార్ హీరోలను బుట్టలో పడేసాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ తర్వాత నిర్మాణానికి దూరం అయ్యారు.
అప్పుడే నటుడు సచిన్ జోషి తో వివాదాలు, పేమెంట్స్ విషయంలో గొడవలు ఆయన్ని సైలెంట్ మోడ్ లోకి తోసేసాయి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడా ఫ్లాఫ్ అయ్యి..బ్లేడ్ గణేష్ అనిపించుకుని ..ఇప్పుడు మళ్లీ నటుడిగా మారాడు గణేష్. అయితే నటుడుగా రీఎంట్రీ ఇస్తున్న ఈ టైమ్ లో ఏం అనిపించిందో ఏమో ...మళ్లీ నిర్మాతగా సినిమా మొదలెడుతున్నాడు.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన ప్రొడక్షన్ హౌస్ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఓ ప్రక్క నటన, మరో ప్రక్కన నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే నాని హీరోగా ఓ సినిమా ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే నిర్మాతగా స్టార్ డైరక్టర్స్ తో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు కొత్తవారితో వెళ్లటం పట్ల ఇండస్ట్రీ లో చాలా మంది సంతోషిస్తున్నారు.
నటన విషయానికి వస్తే... మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్గా నటిస్తున్నాడు ఈయన. గణేష్ పాత్రను స్పెషల్గా డిజైన్ చేసారట అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు ఒక్కో ఎపిసోడ్కు రూ.5 లక్షలు చార్జ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘బిజినెస్ మేన్’లో నటించాడు.