ఎన్టీఆర్ యుగపురుషుడు.. ఆయనపై పుస్తకం రావాలిః తండ్రికి బాలకృష్ణ నివాళి
నేడు(మే28) శుక్రవారం ఎన్టీఆర్ 98వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్కి నివాళ్లు అర్పించారు. తండ్రి ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
నేడు(మే28) శుక్రవారం ఎన్టీఆర్ 98వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్కి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రి ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ యుగపురుషుడని కొనియాడారు. ఆయన జీవితంలో పుస్తకం రావాలన్నారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తే తనని నడిపిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఏపీలో కరోనాకి ఆనందయ్య మందు వివాదాంపై ఆయన స్పందించారు. ఆనందయ్య మందుపై తనకు నమ్మకం ఉందని తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభన దృష్ట్యా అభిమానుల క్షేమం ముఖ్యమని భావించి ఈ సారి ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించడం లేదని ఎన్టీఆర్ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఆలపించిన `శ్రీరామదండకం` పాట వీడియోని కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్ విలన్ అని టాక్.