మరోసారి బాలకృష్ణ సినిమా హక్కులు కొట్టేసిన డిజిటల్ సంస్థ..? వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ ఎప్పుడంటే...?
నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా.. వీరసింహారెడ్డి సినిమాతో సై అంటే సై అంటున్నాడు బాలయ్య బాబు. ఇక ఓటీటీలో ఈ సినిమాను చూద్దాంలే అనుకున్న వారికి కూడా అదిరిపోయే అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కించిన సినిమా వీరసింహారెడ్డి. సాలిడ్ మాస్ యాక్షన్ కంటెంట్ తో.. బాలకృష్ణ ఎనర్జీకి తగ్గట్టుగా తెరకెక్కించిన చిత్రం వీరసింహా రెడ్డి. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. థియేర్లు దద్దరిల్లేలా తమన్ మ్యూజిక్ తో.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఇక్కడే కాదు ఓవర్ సిస్ లో కూడా బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది సినిమా.
ఇక ఆల్రెడీ ఫ్యాన్స్ లో మాస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో సందడి చేస్తున్న వీరసింహారెడ్డి సినిమా.. డిజిటల్ రిలీజ్ కూడా ప్లానింగ్ జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను అయితే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం.
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఈసినిమా హక్కలు సాధించిన సంస్థ మరేదో కాదు.. లాస్ట్ బాలయ్య నుంచి వచ్చి.. సెన్సేషనల్ హిట్ సాధించిన అఖండ స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న డిస్నీ+ హాట్ స్టార్ లోనే వీరసింహారెడ్డి కూడా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. అయితే స్ట్రీమింగ్ విషయంలో ఇంకా డేట్ ను ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారట టీమ్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.