#VeeraSimhaReddy:నిజమైతే నిర్మాతల పాలిట బాలయ్య బంగారమే
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా వీరసింహారెడ్డి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్షన్స్ రావాలంటే...
సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందమూరి హీరో బాలకృష్ణ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్న ఈ చిత్రానికి బజ్ ఓ రేంజిలో ఉంది. ముఖ్యంగా అఖండ ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావటం ప్లస్ అవుతోంది. వీరసింహారెడ్డి రిలీజ్ కోసం చాలా రోజులుగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఈ హైప్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రానికి ఇప్పటివరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 76 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. బాలయ్య గత చిత్రం అఖండ....56 కోట్లు వరకూ బిజినెస్ చేసి భాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరూపించింది. దాంతో ఈ సినిమా రైట్స్ అంతకు మించి అన్నట్లు సాగింది. ఈ చిత్రం అత్యధికంగా నైజాం ఏరియాలో 22 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. సీడెడ్లో 15 కోట్లు, ఈస్ట్లో ఐదు కోట్లు, గుంటూర్లో ఆరు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ సమాచారం ఈ విషయమై ఏమీ లేదు. మీడియా,ట్రేడ్ లో చెప్పుకుంటున్న విషయాలు ఇవి. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా నిర్మాతలకు బంగారు బాతు గుడ్డే.
బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ విలన్గా వీరసింహారెడ్డితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందించాడు. బాలయ్యతో అదిరిపోయే మాస్ కంటెంట్ సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి బాలయ్యను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటికి మాత్రమే సాధ్యం అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరిర్లో మొదటిసారిగా బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని.. అసలు బాలయ్యను ఏ స్థాయిలో చూపించాడు.. ఏ రేంజ్ లో ఆయనతో యాక్షన్ చేయించాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రాక్ ని మించి హిట్ అవుతుందని నమ్ముతున్నారు.