బాలయ్య `అఖండ` మ్యూజికల్ రోర్.. `అడిగా అడిగా`తో స్టార్ట్
బాలకృష్ణ తన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. తాను నటిస్తున్న `అఖండ` సినిమా ప్రమోషన్ షురూ చేశారు. ఈ చిత్ర మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. రేపు సినిమాలోని తొలి పాటని విడుదల చేయబోతున్నారు.
బాలకృష్ణ గేమ్ స్టార్ట్ చేశాడు. ఆయన నటిస్తున్న `అఖండ` చిత్ర మ్యూజికల్ ఫెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని తన రెండు రకాల గెటప్లతో కనువిందు చేసిన బాలయ్య టీజర్తోనూ దుమ్ములేపాడు. `అఖండ ఫస్ట్ రోర్` పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ యాభై మిలియన్స్ కి పైగా వ్యూస్ని దక్కించుకుంది.
`అఖండ మ్యూజికల్ రోర్ బిగిన్స్` అంటూ ప్రకటించారు. రేపటి నుంచి పాటలను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలోని తొలి సాంగ్ `అడిగా అడిగా.. ` పాటని శనివారం సాయంత్రం 5.33గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్ విలన్గా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ లేదు. `సింహ`, `లెజెండ్` చిత్రాల అనంతరం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది. దీంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.