బాహుబలి నిర్మాత శోభుతో ఎమిరేట్స్ సిబ్బంది అమర్యాద
- బాహుబలి నిర్మాత శోభుతో ఎమిరేట్స్ సిబ్బంది అమర్యాద
బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కు మరో రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న బాహుబలి2కి ప్రచారం విషయంలో.. ఏ మాత్రం లోటు జరక్కుండా అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. దుబాయ్ లో ఈ మూవీ భారీ రిలీజ్ అవుతుండడంతో.. మొత్తం టీం అంతా కలిసి దుబాయ్ లో వాలిపోయి ప్రచారం చేశారు. ఇప్పటివరకూ పలు ప్రచార కార్యక్రమాల్లో కాసింత లావుగా కనిపించిన అనుష్క.. ఈ సారి స్టైలింగ్ తోనే లుక్ ను కూడా ఛేంజ్ చేసింది. నీలం షేడ్ లో ఉండే ఆకుపచ్చని చీరకట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లుక్స్ లోకి మారిపోయి భలే ఆకట్టుకున్న స్వీటీ.. మళ్లీ మిర్చి రోజులను గుర్తు చేసేసింది. ప్రత్యేకంగా మిర్చి డేస్ అని ఎందుకు అనాలంటే.. ప్రభాస్ లుక్స్ కూడా ఈ టూర్ లో అదిరిపోయాయి. బాహుబలి2 ఎంత అట్రాక్షన్ అవుతోందో.. మూవీలో వీరిద్దరి జంట అంత కీలకం.
కార్యక్రమం అనంతరం వారంతా దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్ర బృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేట్ వద్ద ఎయిర్లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.