`కట్టప్ప` సత్యరాజ్ ఇంటో విషాదం..
`బాహుబలి` చిత్రంలో `కట్టప్ప`గా నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యారు నటుడు సత్యరాజ్. ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్ చెల్లెలు కన్నుమూశారు.
విలక్షణ నటుడు, `కట్టప్ప` సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్(66) శనివారం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరుప్సూర్ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెని కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్ సోదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు సంతాపం తెలిపారు.
సత్యరాజ్ `బాహుబలి` చిత్రంతో పాపులర్ అయ్యారు. ఇందులో కట్టప్పగా ఆయన నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం నేషనల్ వైడ్గా చర్చనీయాంశంగా మారింది. రెండో భాగంపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. అందుకు తగ్గట్టుగానే సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. హీరోగా కంటే నటుడిగానే ఆయనకు మంచి గుర్తింపు రావడం విశేషం.
`శంఖం` చిత్రంతో తెలుగులోకి పరిచయం అయిన సత్యరాజ్.. ప్రభాస్తో `మిర్చి` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `నేను శైలజ`, `హైపర్`, `బ్రహ్మోత్సవం`, `బాహుబలి`, `నోటా`, `జెర్సీ`, `ప్రతి రోజు పండగే` చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోహీరోయిన్లకి తండ్రి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో గోపీచంద్తో `పక్కా కమర్షియల్` సినిమా చేస్తున్నారు.