మహేష్ కి రూ.50 కోట్లు, అనీల్ కి రూ.10 కోట్లు.. ఇది ఫిక్స్!
సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి కీలకం. ఒక దర్శకుడు హిట్ కొడితే ఇంక వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది.
సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి కీలకం. ఒక దర్శకుడు హిట్ కొడితే ఇంక వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అలాంటిది వరుసగా నాలుగు హిట్లు అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడికి ఇంకెంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. 'ఎఫ్ 2' చిత్రంతో అనీల్ రేంజ్ పెరిగిపోయింది.
ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అతడికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడికి ఎంత పారితోషికం ఇవ్వబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. నిర్మాతలు అతడికి పది కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట.
ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటికీ కలిపి కూడా ఇంత మొత్తాన్ని తీసుకోలేదు. కానీ మహేష్ సినిమాతో స్టార్ దర్శకుల రేంజ్ కి వెళ్లబోతున్నారు. ఇక మహేష్ బాబుకి దాదాపు రూ.50 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం దర్శకుడు, హీరోల రెమ్యునరేషన్లకే అరవై కోట్ల వరకు ఖర్చవుతుంది.
మరో ఇరవై కోట్లలో సినిమా పూర్తి చేయాలనేది డీల్. ఇది అనీల్ రావిపూడికి చాలెంజింగ్ అనే చెప్పాలి. రీసెంట్ గా మహేష్ నటించిన 'మహర్షి' సినిమా సక్సెస్ కావడం, కలెక్షన్లు భారీగా వస్తుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరగడం ఖాయం. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.