Asianet News TeluguAsianet News Telugu

‘ఈ జీవితానికి ఇది చాలు’.. వెక్కివెక్కి ఏడ్చేసిన అనసూయ.. ఎమోషనల్ కామెంట్స్

స్టార్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తను నటించిన ‘రంగమార్తాండ’ చిత్రం రేపు విడుదల కాబోతుండగా.. నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యారు.
 

Anasuya Emotional comments in Rangamarthanda movie promotions
Author
First Published Mar 21, 2023, 8:01 PM IST

ఉగాది సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘రంగమార్తాండ’ Rangamarthanda. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు ప్రకాష్, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ఉగాది సందర్భంగా మార్చి 22(రేపు) థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ప్రెస్ మీట్ లో అనసూయ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు... సినిమా షూటింగ్ అయిపోయి.. డబ్బింగ్ తర్వాత నుంచి రంగమార్తాండ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న ప్రివ్యూ చూశాను. సినిమా చాలా బాగుంది. నా జీవితానికి ఇది చాలు. రంగమార్తాండ లాంటి చిత్రంలో నేను ఉన్నాననేది చాలా  సంతోషానిస్తోందని చెప్పుకొచ్చింది. ఇలా మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకుంది. అందరి ముందే ఏడ్చేసింది. ఎమోషనల్ కామెంట్స్ తో సినిమా గురించి చెప్పుకొచ్చింది.

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా తెలుగులో  వస్తోంది. ఇప్పటికే చిత్ర ప్రివ్యూను చూసిన సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ తోపాటు శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ ముఖ్య పాత్రల్లో నటించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios