'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనన్య పాండే. 

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనన్య పాండే. బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురే ఈ బ్యూటీ. ఇంకా ఆమె నటించిన మొదటి సినిమా విడుదల కాలేదు కానీ బాలీవుడ్ లో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దానికి కారణం ఆమె నటుడు వరుణ్ ధావన్ తో ప్రేమలో ఉన్నానని చెప్పడమే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మొహమాటపడకుండా తనకు వరుణ్ ధావన్ అంటే ఇష్టమని, అతడిని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. వరుణ్ లో తనకు నచ్చే విషయం ఎనర్జీ అని, చాలా క్యూట్ గా ఉండడంతో పాటు.. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిపింది.

ఈ విషయం చెప్పడం పద్ధతో కాదో తనకు తెలియదని.. అయినా చెబుతున్నా అంటూ వరుణ్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం అతడికి కూడా తెలుసునని చెప్పింది. ఇక వరుణ్ విషయనికొస్తే.. అతడు తన చిన్ననాటి స్నేహితురాలు నటాషాని ఘాడంగా ప్రేమిస్తున్నాడు.

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాలు తెలిసి కూడా అనన్య పాండే అతడిని ఇష్టపడుతుందంటే అతడిపై ఆమెకి ఎంత అభిమానముందో అర్ధమవుతోంది!