Asianet News TeluguAsianet News Telugu

రష్మిక మందన్నాతో ఆ స్కిట్‌ ప్లాన్‌ ప్రకారం చేసిందే.. ఆనంద్‌ దేవరకొండ వివరణ.. తను మా ఫ్యామిలీ ఫ్రెండ్‌

`గం గం గణేశా` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక మందన్నా, ఆనంద్‌ దేవరకొండ మధ్య కన్వర్జేషన్‌ హైలైట్‌గా నటించింది. కంటిన్యూగా రష్మికని తన ఈవెంట్లకి తీసుకురావడంపై ఆనంద్‌ వివరణ ఇచ్చాడు. 

anand deverakonda react on conversation with rashmika mandanna and came as guest arj
Author
First Published May 29, 2024, 8:44 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ అయిపోయింది. మొన్న `గం గం గణేశా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమెనే నువ్వు నా ఫ్యామిలీ రా అని ఆనంద్‌ దేవరకొండని పిలిచింది రష్మిక. మరికొన్ని వారి పర్సనల్‌ విషయాలను వెల్లడించారు. అంతేకాదు ఆ ఈవెంట్‌లో ఇద్దరి మధ్య కన్వర్జేషన్‌ వైరల్‌ అయ్యింది. అదే సమయంలో అనేక అనుమానాలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఆనంద్‌ దేవరకొండ స్పందించారు. అది ముందుగానే ప్లాన్‌ చేశామని తెలిపాడు. 

రష్మిక మందన్నా తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని, ఆమెతో ఈ కన్వర్జేషన్‌(స్కిట్‌) ముందుగానే ప్లాన్‌ చేశామని, వైరల్‌ కావాలని ప్లాన్‌ ప్రకారమే చేశామని తెలిపాడు ఆనంద్‌. అంతేకాదు కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా రష్మిక క్లోజ్‌ అయ్యిందని, కలిసి ట్రావెల్‌ చేస్తామని కూడా తెలిపారు. అయితే `నువ్వు నా ఫ్యామిలీ రా` అనడం వెనుక అర్థమేంటనే ప్రశ్నని దాటవేశాడు ఆనంద్‌ దేవరకొండ. మొత్తంగా తమ సినిమా కోసం రష్మిక మందన్నా క్రేజ్‌ని బాగానే వాడుకున్నారు టీమ్‌. 

ఇక `గం గం గణేశా` సినిమా గురించి చెబుతూ, క్రైమ్‌ కామెడీలో సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు `స్వామిరారా` లాంటి సినిమా వచ్చింది. ఆ తర్వాత పెద్దగా రాలేదు. ఈ కథ తన వద్దకు వచ్చినప్పుడు కొత్తగా అనిపించింది. పాత్రలు, స్టోరీ డిఫరెంట్‌గా అనిపించింది. దీంతో వెంటనే ఓకే చేసినట్టు తెలిపాడు ఆనంద్‌. ఇమ్మన్యూయెల్‌తో తన పాత్ర చేసే కామెడీ, యాక్షన్‌ నవ్వులు పూయించేలా ఉంటుందని, హిలేరియస్‌గా ఉంటుందని, ఫన్‌లో ఓ కొత్త రకాన్ని చూడొచ్చు అన్నారు. అయితే కామెడీ చేయడం చాలా కష్టమని, ముందు ఈ స్టోరీ చెప్పినప్పుడు తాను చేస్తానా అనే టెన్షన్ కలిగిందని, కానీ కొన్ని రోజులు వర్క్ షాప్‌ చేసి, కాన్ఫిడెన్స్ వచ్చాక షూటింగ్‌ చేసినట్టు తెలిపాడు ఆనంద్‌. సినిమా గణేషుడి విగ్రహం చుట్టూ తిరుగుతుందని, అదే ఫన్నీగా ఉంటుందని తెలిపాడు. 

`బేబీ` సినిమా తర్వాత తాను ఎంచుకునే కథల్లో మార్పు ఉంటుందని, బడ్జెట్‌ వైజ్‌, స్కేల్‌ వైజ్‌ కాస్త పెద్ద కంటెంట్‌ ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికి కెరీర్‌ పరంగా ఎదగాలని ఉంటుందని, తాను కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలిపాడు ఆనంద్‌. అయితే కమర్షియల్‌, మాస్‌ సినిమాలు చేసే క్రమంలో కంటెంట్‌ని వదిలేయలేనని, కంటెంట్‌ ఉన్న సినిమాలకే ప్రయారిటీ ఉంటుందన్నారు. తనకు `రా.. యాక్షన్‌ మూవీస్‌ చేయడం ఇష్టమని, ప్రస్తుతం వినోద్‌ ఆనంతోజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పాడు. అలాగే `డ్యూయెట్‌`తోపాటు `బేబీ` టీమ్‌తో మరో మూవీ చేస్తున్నానని తెలిపారు ఆనంద్‌ దేవరకొండ.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios