పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్. బద్రి తరువాత మహేష్ బాబుతో ‘నాని’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.

2011 లో నందమూరి బాలకృష్ణతో ‘పరమవీర చక్ర’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్ వైపు వెళ్ళిపోయి మరో తెలుగు సినిమాలో నటించలేదు. మళ్ళీ దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఒక హాట్ హాట్ ఐటం సాంగ్ తో..

‘ఆకతాయి’ అనే సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ పాటలో కనిపించనుంది అమీషా పటేల్. ఈ పాట చిత్రీకరణ సారధి స్థూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో జరిగింది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ సందర్బంగా అమీషా పటేల్ మాట్లాడుతూ ‘చాలా ఏళ్ల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది’ అన్నారు. ఆశిష్‌రాజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ భీమన డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. అని తెలిపారు.