`వి`: అమేజాన్ రూల్... నాని నెత్తినే మొత్తం భారం?
సినిమా రైట్స్ తీసుకునేటప్పుడు ఎగ్రిమెంట్ లో ఆ రూల్స్ ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. నెట్ ఫ్లిక్స్ వాళ్లైతే తాము తీసుకున్న సినిమా రిలీజ్ డేట్ ని తామే నిర్ణయించుకుని ఎనౌన్స్ చేస్తారు. తమదగ్గర ఉన్న కంటెంట్..అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రిలీజ్ డేట్ ప్రకటన చేస్తారు.
ప్రతీ ఓటీటి ప్లాట్ ఫామ్ కు తమకంటూ ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. సినిమా రైట్స్ తీసుకునేటప్పుడు ఎగ్రిమెంట్ లో ఆ రూల్స్ ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. నెట్ ఫ్లిక్స్ వాళ్లైతే తాము తీసుకున్న సినిమా రిలీజ్ డేట్ ని తామే నిర్ణయించుకుని ఎనౌన్స్ చేస్తారు. తమదగ్గర ఉన్న కంటెంట్..అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రిలీజ్ డేట్ ప్రకటన చేస్తారు. నిర్మాతలకు ఇందులో ప్రమేయం ఉండదు. అదే అమేజాన్ ప్రైమ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్లు ప్రమోషన్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎక్కువ రేటు పెట్టి కొన్న స్టార్స్ సినిమాలు ఆ రూల్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం `వి`. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ విషయాన్ని ఇప్పటికే ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇప్పుడు అమేజాన్ రూల్ ప్రకారం ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన భాధ్యత ఈ సినిమాలో నటించిన స్టార్స్ పై ఉంది. అంటే నాని, సుధీర్ బాబులు ఆ భాధ్యత తీసుకోవాలి.
నాని,సుధీర్ బాబు లు ఈ సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. ముఖ్యగా రిలీజ్ డేట్ గురించి లీడ్ ఇస్తూ పోస్ట్ లు పెట్టాలి. నాని ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ని తనదైన శైలిలో మొదలెట్టాసారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇంటర్వూలు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఓటీటి రిలీజ్ అన్నట్లు లైట్ తీసుకోకుండా థియోటర్ రిలీజ్ లాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
నాని ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను క్రిసమస్ కానుకగా విడుదల కానుందా లేదా అన్నది సస్పెన్స్.