ఐకాన్ స్టార్కి ప్రతిష్టాత్మక జీక్యూ పురస్కారం.. తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు..
అల్లు అర్జున్కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఆయనకు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురష్కారాలు దక్కగా, ఇప్పుడు జీక్యూ అవార్డు లభించింది.
అల్లు అర్జున్ `పుష్ప` సినిమాతో ఇండియా వైడ్గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఆయన ఇమేజ్ రష్యా వరకు వెళ్లింది. `పుష్ప` రష్యాలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. `సైమా`, `ఫిల్మ్ ఫేర్` అవార్డు వేడుకల్లో `పుష్ప` సత్తా చాటింది. బన్నీకి అనేక అవార్డులు వచ్చాయి. మరోవైపు సినిమా కూడా కలెక్షన్ల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఊహించిన విధంగా ఇది రూ.350కోట్లు వసూలు చేసింది.
ఇటీవల బన్నీకి సీఎన్ఎన్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ మేగజీన్ `జీక్యూ` అందించే ప్రతిష్టాత్మక పురస్కారం అల్లు అర్జున్ కి దక్కింది. జీక్యూ అవార్డు 2022కి సంబంధించిన `జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్` అవార్డుని అందుకున్నారు. అంతేకాదు ఆయన్ని `లీడింగ్ మ్యాన్` పిలవడం విశేషం. ఫలక్నూమా ప్యాలెస్ లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు బన్నీ. ఈ అవార్డు కోసం జీక్యూ సంస్థ నిర్వహకులు హైదరాబాద్కి రావడం విశేషం.
అంతేకాదు ఈ అవార్డు విషయంలో బన్నీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలవడం విశేషం. తమ అభిమాన నటుడికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ `పుష్ప 2` షూటింగ్లో పాల్గొంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది.