Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’రష్యన్ ట్రైలర్..వెరైటిగా 'తగ్గేదేలే' డైలాగ్!


‘పుష్ప’ సినిమా రష్యాలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది.  చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ ను విడుదల చేశారు. 

Allu Arjun Pushpa The Rise Russian trailer out
Author
First Published Nov 29, 2022, 4:11 PM IST


గత కొంతకాలంగా మన సినిమాల స్దాయి పెరిగింది. ప్యాన్ ఇండియా సినిమాలు...ఇంటర్నేషనల్ మార్కెట్ తో చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా మన చిత్రాలు విదేశాల్లోనూ విజయకేతం ఎగురవేస్తున్నాయి. ఇక్కడ సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు ప్రపంచదేశాల్లోనూ సత్తాచాటుతున్నాయి. అక్కడా మంచి మార్కెట్ ఏర్పాటైంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అనేక దేశాల్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది.  స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప:ది రైజ్‌’ ఇప్పటికే పలు భాషల్లో ప్రేక్షకులను అలరించింది. 

తాజాగా ఈ సినిమా రష్యాలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది.  చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారని అర్థమవుతోంది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగు అని చెప్పారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 

 ‘పుష్ప’ మార్క్ డైలాగ్ ‘తగ్గేదేలే’ రష్యన్ భాషలో వింటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ చూస్తుంటే రష్యన్ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం కలుగుతోందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. మీరూ ఈ ట్రైలర్ పై  ఓ లుక్కేయండి.

మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను రష్యన్‌ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమాను రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను విడుదలచేయనున్నట్లు ప్రకటించిన చిత్రటీమ్  తాజాగా తేదీను వెల్లడించింది. డిసెంబర్‌ 8న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించనుంది. దీని కోసం పుష్ప  టీమ్ రష్యా చేరుకోనుంది.

మరో ప్రక్క ఈ సినిమాకు సీక్వెల్ గా  ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఫస్ట్ పార్ట్ అఖండమైన విజయం సాధించడంతో రెండోభాగం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప: ది రూల్‌’ను అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేస్తోంది చిత్ర టీమ్. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సీన్స్  షూట్ చేస్తున్నట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios