Asianet News TeluguAsianet News Telugu

6 నెలలైనా తగ్గనని పుష్ప క్రేజ్... టీఆర్పీలు పేలిపోతున్నాయి, బన్నీ డైలాగ్ బ్లాస్ట్ అయిపోతోంది

రిలీజ్ అయ్యి దాదాపు 6   నెలలు అవుతున్నా..అల్లు అర్జున్  పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా  పుష్ప మ్యానియా గట్టిగా నడుస్తోంది. పుష్ప  పాటలు, డైలాగ్స్ , మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ.. కోన్ని వందల వీడియోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అటు టీవిలో కూడా బ్లాస్టింగ్ టీఆర్పీతో దూసుకుపోతోంది పుష్ప. 
 

Allu Arjun pushpa movie Craze
Author
Hyderabad, First Published Jul 1, 2022, 12:52 PM IST

పుష్ప మ్యానియా మూమూలుగా లేదు. పుష్పసినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళాడు అల్లు అర్జున్. ఫస్ట్ మూవీతోనే దడదడలాడించాడు బన్ని. బన్నీ క్రేజ్.. పుష్ప ఊపు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా  మారుమోగిపోతోంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ లా బుజం పైకి లేపి నడిచే ట్రెండ్ అయితే గట్టిగా వైరల్ అయ్యింది. అంత కాదు తగ్గెదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ మ్యానరిజం ఇంకా వైరల్ అయ్యింది. ఒక తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా వస్తున్న క్రేజ్ కు మైండ్ బ్లాక్ అవుతోంది.

గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ వసూళ్లు సాధించింది. అంతే కాదు ఇండియన్ సినిమాను తనవైపు చూసేలా చేసుకుంది ఈమూవీ.  ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో అందులో డైలాగ్స్ సాంగ్స్ కూడా అంతే సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా బన్నీ తగ్గేదే లే డైలాగ్ మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతటా పాపులర్ అయ్యింది. రాయలసీమ యాసలో బన్నీ చెప్పిన ఈ డైలాక్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఈ డైలాగ్ ను చెప్పనివారంటూ ఉండరేమో..

అభిమానులు ఆడియన్స్.. ఈ డైలాగ్ తో సోషల్ మీడియాను హోరెత్తించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. ఈ డైలాగ్ తో రీల్స్ చేస్తూ.. సందడి చేశారు. పొలిటికల్ లీడర్స్, ప్లేయర్స్ ఒక్కళ్ళేమిటి.. ఈ డైలాగ్ చెప్పనివారు ఎవరూ ఉండరేమో.. అన్నట్టు మారిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు దాటినా సరే ఇంకా పుష్ప మ్యానియా తగ్గలేదు. రీసెంట్ గా ఈ డైలాగ్ ఏకంగా రెజ్లింగ్ రింగ్ పై కి ఎక్కింది. తగ్గేది లేదంటూ తొడకొట్టి నిలిచింది. 

 

 

ప్రముఖ ఇండియన్ రెజ్లర్  సౌరవ్ గుజ్లర్ రీసెంట్ గా ఓ రెజ్లింగ్ ఈవెంట్ కు వెళ్లారు. అక్కడ తన కాంపిటేటర్ ను ఓడించిన ఆంనందంలో.. తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ డైలాగ్ కు సంబంధించిన చర్చ నడుస్తోంది. 

ఇక సిల్వర్ స్క్రీన్ మీద దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఈమూవీ.. ఓటీటీ తో పాటు టీవీల్లో కూడా సత్తా చాటింది. టీవీల్లో మూడు సార్లు ప్లే అయ్యిన ఈసినిమా మొదటి సారి 22.54 టీఆర్పీని సాధించి తగ్గేదేలే అని నిరూపించింది రెండో సారి  12. 87 శాతం టీఆర్పీ సాధించని పుష్ప మూవీ.. ముచ్చటగా మూడోసారి ఏకంగా 9. 57 టీఆర్పీతో రచ్చ రచ్చ చేసింది. ఏటు చూసుకున్నా పుష్ప రికార్డ్స్ ను అందుకోవడం ఇంకో సినిమాకు సాద్య కాదనే అంటున్నారు సినిమా పండితులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios