ఏనుగుకు స్నానం చేయించిన హీరోయిన్... బన్నీతో జతకట్టిన ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
ఓ హీరోయిన్ ఏనుగుకు స్నానం చేయించింది. సదరు వీడియో తన అధికారిక అకౌంట్లో షేర్ చేశారు. ఆమె సాహసానికి నెటిజెన్స్ ఔరా అంటున్నారు.
హీరోయిన్ ఆదా శర్మ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె మావటిలా మారి ఏనుగుకు స్నానం చేయించింది. ఈ వీడియో ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. బొద్దింకలు, బల్లులకు కూడా భయపడే అమ్మాయిలున్న ఈ రోజుల్లో ఏకంగా ఏనుగు దగ్గరకు పోయిన ఆమె సాహసాన్ని జనాలు కొనియాడుతున్నారు. మేడం మీరు గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆదా శర్మ ఇలాంటి భిన్నమైన సోషల్ మీడియా పోస్ట్స్ కి పెట్టింది పేరు.
ఈమె మల్టీ టాలెంటెడ్. డాన్స్, జిమ్నాస్టిక్స్, కర్రసాము వంటి అనేక కళల్లో ప్రావీణ్యం ఉంది. తన టాలెంట్ ప్రదర్శిస్తూ... వీడియోలు చేసి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తుంటారు. అవి కాస్తా వైరల్ అవుతుంటాయి. ఇంత టాలెంట్ ఉన్నా హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఆమెకు కాలం కలిసి రాలేదు. ఆదా శర్మ పరిశ్రమకు వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 2008లో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ ఆదా శర్మను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. 2014లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ మూవీలో నితిన్ కి జంటగా ఆదా శర్మ నటించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమె రేంజ్ సెకండ్ హీరోయిన్ రేంజ్ కి పడిపోయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో పేరుకు హీరోయిన్ పాత్ర చేశారు. చెప్పాలంటే ఆమెది జస్ట్ వ్యాంప్ రోల్. కనీసం హీరోతో ఒక సాంగ్ కూడా ఉండదు.
తెలుగులో ఆమె నటించిన హిట్ చిత్రం క్షణం. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో అడివి శేష్ హీరోగా నటించారు. కల్కి మూవీలో రాజశేఖర్ తో జతకట్టారు. ఆమె చివరిగా నటించిన తెలుగు చిత్రం మీట్ క్యూట్. ప్రస్తుతం ది కేరళ స్టోరీ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. 30 ఏళ్ల ఆదా శర్మ ఇంకా కెరీర్ మీద ఆశలతో ముందుకు వెళుతున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందని నమ్ముతున్నారు.