అఫీషియల్: 'నాంది' చిత్రం ఓటీటి రిలీజ్ డేట్
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో విజయ్ తెరకెక్కిన ఈ చిత్రం నరేష్ నటించిన గత సినిమాలకు భిన్నంగా ఉంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా అల్లని నరేష్ మరోసారి తన విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ఉంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
గత కొంతకాలంగా సరైన హిట్ అనేది లేక ఇబ్బందులు పడుతున్న అల్లరి నరేష్కు నాంది చిత్రం పూర్తి స్దాయి రిలీఫ్ ఇచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. రిలీజైన రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రంకి ఇప్పటికే దిల్ రాజు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ సినిమా ఓటీటి రైట్స్ ని ఆహా వారు సొంతం చేసుకున్నారు.ఇప్పటికీ థియేటర్లో సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి సిద్దమవుతున్నారు.ఈ చిత్రం ఎప్పుడు ఆహా లో రాబోతోందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో మార్చి 12న చిత్రాన్ని ఆహా ప్లాట్ ఫాంలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను 2.50 కోట్లకు కొనుగోలు చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా ఆహాలో విడుదల కానుండగా, ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఇంటి నుండే చూసే ఛాన్స్ లభించబోతోంది. ఫిబ్రవరి 19న విడుదలైన నాంది చిత్రంలో అల్లరి నరేష్ చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించే వ్యక్తి పాత్రలో నటించారు. పూర్తి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా నాంది చిత్రం ఉండగా, ఇందులో నరేష్ లోని సరికొత్త కోణం బయటకు వచ్చింది.
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో విజయ్ తెరకెక్కిన ఈ చిత్రం నరేష్ నటించిన గత సినిమాలకు భిన్నంగా ఉంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా అల్లని నరేష్ మరోసారి తన విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ఉంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా అద్భుతంగా నటించి అలరించింది. చాలాకాలం నుంచి సరైన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నరేష్ కు నాంది చిత్రం ఆకలిని తీర్చిందనే చెప్పాలి. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత నాంది రూపంలో తనకు ఇంత మంచి విజయం రావడంతో చాలా ఎమోషనల్ అయి కంట కన్నీరు కూడా పెట్టుకున్నారు నరేష్.