బాక్సాఫీస్ బద్దలు కొట్టిన వీరయ్య, ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వీరయ్య.. సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. చిరుని వింటేజ్ లుక్లో చూపించి.. మెగా కిక్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. దాంతో మెగాస్టార్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఓవర్సీస్లో అయితే వీరయ్య ఆధిపత్యం క్లియర్గా కనిపించింది. ఈజీగా 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. దాంతో ఆచార్య ఫ్లాప్ తర్వాత మెగా దాహం తీరినట్టే. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి కావొస్తుంది. ఈ నేపధ్యంలో మరో మూడు వారాల్లో వాల్తేరు వీరయ్య ఓటిటిలోకి రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి.. ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మెగాఫ్యాన్స్.
థియేటర్కు వెళ్లలేని వారు.. మరోసారి తమ అభిమాన హీరోని ఒకటికి రెండు చూసుకోవడానికి.. వీరయ్య ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఫలాన రోజు డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతోందని ప్రచారం జరిగినా.. ఎట్టకేలకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి రైట్స్ను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. దాంతో ఫిబ్రవరి 27 నుంచి అంటే ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఓటిటిలో అందుబాటులోకి రాబోతున్నట్టుగా అధికారంగా ప్రకటించారు. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన వీరయ్య, ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే చిరు మునపటి మూవీ గాడ్ఫాదర్ కూడా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వారం రోజులు పాటు నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచి, RRR తరువాత మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ లేదా దసరాకి రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా నటిస్తోంది.