పవన్ కళ్యాణ్ మీద బ్లాక్ మెయిలర్, లూటీ ఆరోపణలు
- త్వరలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ
- ఈ సినిమా టికెట్స్ ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు
- పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిలర్,లూటర్ అంటూ అఖిలభారత సినీ వినియోగదారుల ఆరోపణలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై లూటీ, బ్లాక్ మెయిలర్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు. 'కాటమరాయుడు' సినిమా రిలీజ్ సందర్భంగా కోట్ల రూపాయలు దండుకోవడమే లక్ష్యంగా సామాన్యులకు సినిమాను దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
'కాటమరాయుడు' సినిమా మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని... రూ. 10 టికెట్ 50, రూ. 50 టికెట్ రూ. 200, రూ. 150 టికెట్లను రూ. 500లకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. అభిమానుల వీక్ నెస్ అడ్డుపెట్టుకుని కాటమరాయుడు బెనిఫిట్ షో టికెట్స్ రూ. 2 వేల నుండి 5 వేల వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణల నేపథ్యంలో సామాన్యులను లూటీ చేయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అని అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు విమర్శిస్తున్నారు.
టికెట్ రేట్ల పెంపుపై ఇప్పటికే కోర్టులో కేసు వేసామని, సామాన్యులకు టికెట్ల రేటు అందుబాటులోకి వచ్చే వరకు పోరాటం ఆగదని భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' ఈ నెల 24న గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కిషోర్ పార్దసాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మించారు.