'అల.. వైకుంఠపురంలో..' టీజర్ ఆ స్పెషల్ రోజునే!
బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు 'దువ్వాడ జగన్నాథం(డీజే)'లో కలిసి నటించారు.
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' . ఈ చిత్రం టీజర్ ని నిన్న మొన్నటిదాకా నవంబర్ 7 వ తేదీన త్రివిక్రమ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ ప్లాన్ మారిందని సమాచారం. అక్టోబర్ 8 విజయదశమి కానుకగా విడుదల చేయాలని టీమ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే...ఈ సినిమాలో బన్నీ క్లాసా ? మాసా.. ? అనే చర్చ జరుగుతోంది. బన్నీ పాత్రను త్రివిక్రమ్ 'రౌడీ అల్లుడు' మూవీలో చిరంజీవి పాత్రలా రెండు డిఫరెంట్ షేడ్స్ లో డిజైన్ చేసారనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ వస్తే గానీ వైకుంఠపురంలో బన్నీ పాత్రలో క్లారిటీ వచ్చేలా లేదు. ఇందుకోసం బన్నీ ఫ్యాన్స్ కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు 'దువ్వాడ జగన్నాథం(డీజే)'లో కలిసి నటించారు.
టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.