మరోసారి మల్టీస్టారర్స్ మూవీలో అక్కినేని హీరోలు సందడి చేయనున్నారు. ఈ మేరకు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మనం, బంగార్రాజు మూవీలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అక్కినేని ఫ్యామిలీ... మరో మూవీతో ఆడియెన్స్ ను ఖుషీ చేయనున్నారు.    

సైలెంట్ గా వస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నారు.. అక్కినేని హీరోలు . మల్టీ స్టారర్ మూవీస్ తీస్తూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తున్నారు. 2014లో ఫాంటసీ డ్రామా ఫిల్మ్ ‘మనం’(Manam)తో మంచి హిట్ ను అక్కినేని ఫ్యామిలీ ఖాతా పడిపోయింది. మళ్లీ ఈ సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ మూవీకూడా ఊహించని విధంగా ఫెస్టివల్ కు బెస్ట్ మూవీగా ముద్ర వేయించుకుంది. దీంతో అక్కినేని వారింట రెండు మల్టీస్టారర్ మూవీస్ జమ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. అక్కినేని హీరోలే మరో మల్టీ స్టారర్ మూవీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

మంచి కథలు దొరికితే అక్కినేని హీరోలు మల్టీస్టారర్ మూవీలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మనం, బంగార్రాజు మూవీ తర్వాత ఇప్పుడు అదే స్పీడ్ లో ఇంకో మల్టీస్టారర్ కు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలిసి నటించిన నాగార్జున.. ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. మరో క్రేజీ బస్ కూడా వినిపిస్తోంది. ఈ మూవీని డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్టర్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 

ఇప్పటికే చిరుతో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా అక్కినేని వారి క్రేజీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటికిప్పుడు ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకివెళ్లే అవకాశలు లేవు. ప్రస్తుతం అఖిల్ (Akhil) ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ, నాగార్జున(Nagarjuna) ది ఘోస్ట్ మూవీలో  నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షెడ్యూల్ పూర్తయ్యాక ఈ మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించనున్నారంట. మరోవైపు బంగార్రాజుకు సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అక్కినేని హీరోల మల్టీస్టారర్స్ లిస్ట్ ను పెంచేందుకు కింగ్ నాగార్జున పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడనేది అర్థమవుతోంది.  

అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున(Nagarjuna ) – నాగచైతన్య(Naga Chaitanya) హీరోలుగా తెరకెక్కిన సినిమా బంగార్రాజు.. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  2016 లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా  తెరకెక్కిన ఈ మూవీని కల్యాణ్ కృష్ణ డైరెక్టర్ చేశారు.   నాగార్జున సరసన హీరోయిన్ గా రమ్మకృష్ణ నటించగా.. నాగచైతన్యకు జోడీగా యంగ్ స్టార్ కృతి శెట్టి నటించింది. దాదాపు ఈ మూవీ 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. ఫిబ్రవరి 18 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కూడా ప్రారంభమైంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ ను దక్కించుంది.