ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఖిల్ హీరోగా భొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ” భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా కలసి జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించారు . ఈ చిత్రం అక్టోబర్ 15న విజయదశమి సందర్బంగా విడుదలయ్యి పండగ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గొపిసుందర్ అందించిన ఆడియో సూపర్బ్ సక్సస్ అవ్వటం తో ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతం గా ఆకట్టుకుని దియెటర్స్ కి ప్రేక్షకుల్ని రప్పిస్తుంది. ఇప్పుడు ఈ సినమా ఓటీటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
నెల 19 నుంచి నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని అఖిల్ కెరీర్లో తొలి హిట్ మూవీ ఇదే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ రూ.20.91 కోట్ల బిజినెస్ చేయగా… ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లకు రూ.2.75 కోట్ల లాభాలు వచ్చాయి.
https://twitter.com/PoojaFansOnline/status/1459745292190830592
ఇక అనౌన్స్ అయిన దగ్గర నుంచే అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా…మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ రివీల్ తో అంచనాలను విపరీతంగా పెంచేసుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ను డైరెక్ట్ చేస్తుండడం.. అఖిల్, పూజా హెగ్డే కాంబో నటిస్తుండడంతో.. ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందుకు తగ్గట్టే రిలీజైన నాటి నుంచి క్రేజీ టాక్తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా సాంగ్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. సెకండ్ వేవ్ తరువాత రిలీజైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.,.. అఖిల్ ని మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు ఓటీటిలో ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.