అఖిల్ , శ్రియలు అసలు ఎందుకు విడిపోయారు...
- గత డిసెంబర్ లోనే అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, శ్రియా భూపాల్ నిశ్చితార్థం
- త్వరలోనే రోమ్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకునేందుకు జోరుగా ఏర్పాట్లు
- ఇంతలోనే రోమ్ ఫ్లైట్ టికెట్స్ రద్దు చేసుకోవాలని బంధు మిత్రులకు సూచించిన కుటుంబాలు
- అసలు అఖిల్, శ్రియా భూపాల్ విడిపోవడానికి కారణం ఏంటి... మళ్లీ కలుస్తారా..
అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్ల పెళ్లి రద్దయిందన్న వార్త గత రెండ్రోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లోనే కేక హైదరాబాద్ ఏలీట్ జనాలు, తెలుగు ప్రజలకు సంచలన వార్త. మీడియాలో ఈ వార్త కేవలం నిన్నటి నుంచే వచ్చినప్పటికీ.. ఇద్దరి మధ్య బ్రేకప్ ఎప్పుడో జరిగిపోయిందని సమాచారం.
నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. చిన్న ఏజ్ (22 ఏళ్లు)లోనే ఉన్న అఖిల్, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్కు నాగ్ ఎంతగానో నచ్చ చెప్పాడట. చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్ వినకపోవడంతో సరేనని చెప్పేసిందట అక్కినేని కుటుంబం.
అయితే ఈ వివాహం రద్దు కావడానికి అఖిల్, శ్రీయల మధ్య హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఎయిర్ పోర్ట్ లో పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది. రోమ్లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరాట. అంతా కూల్ గా జరుగుతున్న వేళ ఒక్కసారిగా టీకప్పులో తుఫాను కాస్తా... పెను తుఫానుగా మారిందట.
ఎయిర్పోర్ట్లోనే అఖిల్, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయట. అక్కడే బహిరంగంగా వాదనకు దిగారాట. ఇరువురి మధ్య ఘర్షణ ఎంతకూ తగ్గకపోగా తీవ్ర స్థాయికి చేరిందట. వాదన అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్బై చెప్పేసి అక్కినేని అఖిల్ తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడట. అలా వెళ్తున్నా... వారిద్దరూ అఖిల్ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. ఆ తర్వాత అఖిల్ను, శ్రీయను కలిపేందుకు నాగ్ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్ సైలెంట్ అయిపోయాడని సమాచారం.
మొత్తానికి సినిమా సెలెబ్స్ సంబంధాలు, ఉన్నోళ్ల బంధాలు అన్యోన్యంగా ఉంటాయనుకునే వారికి అది తప్పని మరోసారి ప్రూవ్ అయింది. ఏదేమైనా ఏర్ పోర్ట్ లో జరిగిన ఘటనను గురించి పరిశీలిస్తే... ఇద్దరూ మళ్లీ కలిసే ఛాన్సెస్ అస్సలు లేవనే సమాచారం వస్తోంది.