సీన్ లో అదే రోజు పవన్ ఉన్నాడని డబ్బింగ్ ఆపారా?
బైక్ రేసర్గా అజిత్కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి అజిత్తో చిత్రమైన విన్యాసాలు చేయించి, గాల్లో బైకును నడిపిస్తే ఎలా ఉంటుందో గ్లింప్స్ లో చూపించింది చిత్రయూనిట్. అర్జున్ నువ్ నా ఈగోను టచ్ చేశావ్.. అంటూ కార్తికేయ చెప్పడం.. నా ఆట ఎప్పుడో మొదలెట్టేశాను తంబి అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
పవన్ కళ్యాణ్ కు ఏ రేంజిలో క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అదే విధంగా తమిళంలో అజిత్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఇద్దరూ పోటీ పడుతున్నట్లుగా ఉంటారు. అలాగే అజిత్ నటించిన సినిమాలు పవన్ కళ్యాణ్ రీమేక్ చేసారు. ఇప్పుడు వీరిద్దరు సినిమాలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ నటించిన పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” అజిత్ నటించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలిమై” రెండు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పవన్ భీమ్లా నాయక్ జనవరి 12నే అని ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే డేట్ కి అజిత్ మోస్ట్ అవైటెడ్ సినిమా వలిమై కూడా రిలీజ్ కానుందని తమిళ సినిమా వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ వలిమై గురించి ఇప్పటిదాకా టాక్ అయితే లేదు.
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అజిత్ హీరోగా నటిస్తున్న 60వ సినిమా ఇది.. ఈ సినిమాతో టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కి రెస్పాన్స్ అదిరిపోయింది. రీసెంట్గా రిలీజ్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 2022 సంక్రాంతికి ‘వలిమై’ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
బైక్ రేసర్గా అజిత్కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి అజిత్తో చిత్రమైన విన్యాసాలు చేయించి, గాల్లో బైకును నడిపిస్తే ఎలా ఉంటుందో గ్లింప్స్ లో చూపించింది చిత్రయూనిట్. అర్జున్ నువ్ నా ఈగోను టచ్ చేశావ్.. అంటూ కార్తికేయ చెప్పడం.. నా ఆట ఎప్పుడో మొదలెట్టేశాను తంబి అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక డైలాగ్ల కంటే ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బైక్ రేసింగ్లన్నీ కూడా గాల్లోనే జరిగాయి. యాక్షన్ సీక్వెన్లన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను రూపొందించాడు. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలు .. సింగిల్స్ ఆకట్టుకున్నాయి.