అజిత్కి బాంబ్ బెదిరింపులు.. పోలీసుల తనిఖీలు..
తమిళ హీరో అజిత్ ఇంట్లో బాంబ్ ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ పెద్ద దుమారం సృష్టించింది. మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్ కోలీవుడ్ మొత్తం కలకలం రేపింది.
తమిళ హీరో అజిత్ ఇంట్లో బాంబ్ ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ పెద్ద దుమారం సృష్టించింది. మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్ కోలీవుడ్ మొత్తం కలకలం రేపింది. దీంతో అజిత్తోపాటు, ఆయన అభిమానులు షాక్కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే, కోలీవుడ్ స్టయిలీష్ స్టార్గా పేరున్న అజిత్ చెన్నైలోని తిరువాన్మియూరులోని నివాసం ఉంటున్నారు. భార్య షాలిని, పిల్లలతో ఆయన నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అజిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకున్నారు. జాగిలాలతో ఇల్లు మొత్తం తనఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబ్ లేదని నిర్ధారించారు. ఎవరో ఆఖతాయిలు చేసిన పనిగా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్కి ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ కొత్త కాదు, గతంలోనూ వచ్చాయి.
మరోవైపు ప్రస్తుతం అజిత్ `వాలిమై` చిత్రంలో నటిస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బోనీ కపూర్ నిర్మాత. ఈసినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల అజిత్ తన 50వ పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే.