Asianet News TeluguAsianet News Telugu

టాక్స్ ఎగ్గొట్టిన ఐశ్వర్యా రాయ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు నోటీసులు

మాజీ విశ్వసుందరి... బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నారు. తన నిర్లక్ష్యంతో ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇంతకీ ఐశ్ ప్రాబ్లమ్ ఏంటీ..? 

AISHWARYA RAISTUCK IN BIG TROUBLERECEIVES NOTICE
Author
First Published Jan 18, 2023, 12:09 AM IST

మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ నటి.. సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్యర్యారాయ్‌ బచ్చన్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిన్నార్‌లోని ఓ భూమికి సంబంధించి ఆమె టాక్స్ కట్టకపోవడంతో వారు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ ను ఆమె చెల్లించడం లేదని ఆరోపణ. ఈ క్రమంలోనే నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. ఐశ్యర్య రాయ్ తో పాటు మరో 1200 మంది కూడా టాక్స్ లు కట్టకపోవడంతో వారికి కూడా నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులను రెవెన్యూ అధికారులు అందిస్తున్నారు. 

నోటీసులు అందుకున్న వారిలో పలు బడా  కంపెనీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా టాక్స్ లు ఎగ్గడంటతో ప్రభుత్వానికి రావల్సిన 1.11 కోట్లు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ మార్చిలోగా కట్టకుండా ఉన్న టాక్స్ అంతటిని క్లియర్ చేయాలి అని వారికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారు. ఐశ్యర్యా రాయ్‌కు నాసిక్‌ సిన్నార్‌లోని అవడీ ప్రాంతంలో విండ్‌మిల్ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ప్రతీ ఏడాది ఆమె టాక్స్ కట్టాలి. కాని ఈసారి కట్టకుండా వదిలేసినందకు అనేకసార్లు పన్నుకు సంబంధించి.. అధికారులు రిమైండర్‌లు చేశారు. సంవత్సర కాలంగా.. భూమికి పన్ను చెల్లించలేదు. దీంతో సిన్నార్ తహసీల్దార్ ఐశ్వర్యకు నోటీసులు పంపారు.

ఐశ్వర్య రాయ్ రూ.21,960 భూమి పన్ను చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. 10 రోజులలోపు చెల్లించకపోతే, మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం, 1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇక ఐశ్యర్యా రాయ్ రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ సినిమాతో బిజీగా ఉంది. చాలా కాలం నటనకు దూరంగా ఉన్నబ్యూటీ ఆమధ్య నుంచే నటిస్తోంది కాని అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోతోంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ మూవీ మాత్రం సూపర సక్సెస్ ను అందించింది ఐశ్వర్యరాయ్ కి. 

Follow Us:
Download App:
  • android
  • ios