1994లో విశ్వసుందరిగా ఐశ్వర్యరాయ్ ఎంపికయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో సైతం ఆమె దూసుకుపోయింది. వయసు పైబడుతున్నా అందంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్న ఐష్.. ఆరాధ్య అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఐశ్వర్యరాయ్కి ఒక్కతే కూతురు కాగా.. తాను ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ 32 ఏళ్ల సంగీత్కుమార్ అనే వ్యక్తి రచ్చ చేస్తున్నాడు.
"నేను ఐశ్వర్యరాయ్కి ఐవీఎఫ్ విధానంలో పుట్టానని... 1988లో నేను ఐష్కు జన్మించగా..అప్పుడు ఆమె వయస్సు 15. నా తండ్రి నన్ను లండన్ నుంచి వైజాగ్ దగ్గర చోడవరంకు తీసుకు రాగా.. ఓ రెండేళ్లపాటు ఐష్ తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఐష్ సంబంధీకులు నా బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ చింపేశారు. ఐశ్వర్యరాయ్కు నేను మొదటి కొడుకును" అంటూ సంగీత్ కుమార్ అనే వ్యక్తి హంగామా సృష్టించాడు.
“మా అమ్మకి 2007లో అభిషేక్ బచ్చన్ తో పెళ్లైంది , ఆ తర్వాత విడిపోయి..ఒంటరిగా నివసిస్తోంది. మా అమ్మను నేను ప్రస్తుతం ఉంటున్న మంగుళూరు వచ్చి ఉండమంటున్నాను. మా కుటుంబంతో విడిపోయి ఇప్పటికి 27 సంవత్సరాలు అయ్యింది. ఆమెను నేను చాలా మిస్ అవుతున్నాను. నేను వైజాగ్ వెనక్కి వెళ్లను. మా అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చినా ఆమెతో మాట్లాడతాను ,” అన్నారు. అయితే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనికి మానసిక స్థితి బాగోలేదని చెప్పారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ చిత్రంలో విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
