Asianet News TeluguAsianet News Telugu

సంపత్ నంది మొత్తానికి ప్రాజెక్టు సెట్ చేసాడు, హీరో సైన్ చేసాడు

రామ్ చరణ్ తో రచ్చ వంటి చిత్రం చేసిన సంపత్ నంది కెరీర్ పరుగెడుతుందని అంతా భావించారు. అయితే ఆయన ఆ తర్వాత రవితేజ తో చేసిన బెంగాళ్ టైగర్ కానీ, గోపిచంద్ తో  చేసిన ‘గౌతమ్ నంద’వర్కవుట్ కాలేదు

Again Sampath Nandi Direct To Gopichand
Author
Hyderabad, First Published Feb 1, 2019, 7:52 AM IST

రామ్ చరణ్ తో రచ్చ వంటి చిత్రం చేసిన సంపత్ నంది కెరీర్ పరుగెడుతుందని అంతా భావించారు. అయితే ఆయన ఆ తర్వాత రవితేజ తో చేసిన బెంగాళ్ టైగర్ కానీ, గోపిచంద్ తో  చేసిన ‘గౌతమ్ నంద’వర్కవుట్ కాలేదు. బేసిక్ గా రైటర్ అయిన సంపత్ ..స్క్రిప్టులే తడబడ్డాయి. దాంతో ఈ సారి అలాంటి పొరపాటు జరగకూడదనుకున్నారో ఏమో కానీ గౌతమ్ నంద తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు   సంపత్ నంది. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని పట్టాలు ఎక్కిస్తున్నాడు. అయితే ఈ సారి కూడా గోపిచంద్ తోనే చేయనున్నాడు. 

అందుతున్న సమాచారం మేరకు రీసెంట్ గా  గోపిచంద్ ని కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చాడు ఈ దర్శకుడు. విన్న వెంటనే గోపిచంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చాడట. ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మరో ప్రక్క  గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు.   అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను ఇటీవలే లాంచ్ చేశారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో గోపీచంద్ పెరిగిన గెడ్డంతో కొత్త లుక్ తో కనిపించనున్నాడు.  ఆ లుక్ కి సంబంధించిన స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ లుక్ లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios