జైలు జీవితం తరువాత మొదటి చిత్రం... ఏకంగా మూడు భాషల్లో
జైలు నుండి బయటికి వచ్చాక ప్రియుడు అజీజ్ పాషాను రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడం జరిగింది. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంజన, తిరిగి తన సాధారణ జీవితం మొదలుపెట్టే ప్లాన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
హీరోయిన్ సంజనా గల్రాని డ్రగ్స్ ఆరోపణలపై జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని సంజనా గల్రానిని 2020 సెప్టెంబర్ లో అధికారులు అరెస్ట్ చేశారు. కర్ణాటక పరప్పణ అగ్రహారం జైలులో ఆమె నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కాగా ప్రస్తుతం సంజనా గల్రాని బైయిల్ పై బయటికి వచ్చారు. తనపై తప్పుడు కేసులు బనాయించి హింసించారంటూ సంజనా గల్రాని ఆవేదన చెందడం జరిగింది.
జైలు నుండి బయటికి వచ్చాక ప్రియుడు అజీజ్ పాషాను రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడం జరిగింది. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంజన, తిరిగి తన సాధారణ జీవితం మొదలుపెట్టే ప్లాన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సంజనా ఓ నూతన చిత్రానికి సైన్ చేశారట. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుందట.
మణిశంకర్ అనే టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించారట. ఈ చిత్రానికి వెంకట కృష్ణన్ దర్శకత్వం వహించనున్నారట. వచ్చే నెలలో మణిశంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక పోలీసుల విచారణలో సంజనా గల్రాని భారీ మొత్తంలో డబ్బులు, ఆస్థి కూడబెట్టినట్లు గుర్తించారు. పెద్దగా ఆఫర్స్ లేని ఓ టూ టైర్ హీరోయిన్, ఈ స్థాయిలో కోట్ల ఆస్తులు కలిగి ఉండడం పలు అనుమానాలకు దారితీసింది. డ్రగ్స్ కేసులో మరో నటి రాగిణి ద్వివేది అరెస్ట్ కాబడిన విషయం తెలిసిందే. ఆమె కూడా సంజనాతో పాటు జైలులో ఉన్నారు.