#HIT2: 'హిట్ 2 ' ప్రీ రిలీజ్ బిజినెస్ ..బ్రేక్ ఈవెన్ ఎంతకంటే
ఫస్ట్ వీకెండ్ గట్టి వసూళ్లు రాబట్టడమే కాక మరో పది రోజులు పాటు సినిమా సత్తా చూపగలిగితే ఈ మేర వసూళ్లు వెనక్కి రాబట్టే అవకాశం ఉంది. . అందుకే `హిట్ 2` రన్ టైమ్ విషయంలోనూ చిత్రబృందం చాలా కేర్ తీసుకొంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాట ప్రేక్షకులను మెప్పించడంతో అంచనాలు భారీగా ఎర్పడ్డాయి. సోమవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించి మరింత హైప్ తీసుకువచ్చిందిది చిత్ర టీమ్. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఏ స్దాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 16 కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నైజాం 4 కోట్లు
ఆంధ్రా 4.50 కోట్లు
సీడెడ్ 1.50 కోట్లు
నైజాం + ఏపి టోటల్ 10 కోట్లు
కర్ణాటక 1.0
రెస్టాఫ్ ఇండియా (కేవలం తెలుగు) 0.5
ఓవర్ సీస్ 3.0
మిగిలినవి అన్ని కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లు బిజినెస్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం షేర్ క్రింద వస్తే పూర్తి రికవరీ. అంతకు మించి వస్తే హిట్ క్రింద లెక్క. బ్లాక్ బస్టర్ దాదాపు 24 కోట్లు దాకా రావాల్సి ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ గట్టి వసూళ్లు రాబట్టడమే కాక మరో పది రోజులు పాటు సినిమా సత్తా చూపగలిగితే ఈ మేర వసూళ్లు వెనక్కి రాబట్టే అవకాశం ఉంది. . అందుకే `హిట్ 2` రన్ టైమ్ విషయంలోనూ చిత్రబృందం చాలా కేర్ తీసుకొంది. ఈ సినిమా రన్ టైమ్ కేవలం 2 గంటలు మాత్రమే.
ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి `ఏ` సర్టిఫికెట్ అందించింది. ఫస్టాఫ్ అంతా చాలా ఆసక్తికరంగా సాగిందని, సెకండాఫ్లో ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందన్నది సెన్సార్ రిపోర్ట్. హిట్ 1లో విశ్వక్ సేన్ నటించాడు. హిట్ 2లో అడవిశేష్ కనిపించాడు. హిట్ 3లో హీరో మారబోతున్నాడు. ఆ హీరోని… హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేయబోతున్నారు. ఇది కూడా ఇంట్రస్టింగ్ ఎలిమెంటే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 2న విడుదల చేస్తున్నారు.
అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ చూసి చాలామంది భయపడినట్లు కూడా కామెంట్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అడవి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా భానుచందర్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.