క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నటుడు అడివి శేష్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు.
క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నటుడు అడివి శేష్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు. 'క్షణం' సినిమాను నిర్మించిన పివిపి ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాకి 'ఎవరు' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాతో వెంకట్ రామ్ జీ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
రెజీనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమానుఆగస్ట్ 23న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Scroll to load tweet…
