Asianet News TeluguAsianet News Telugu

షాక్:‘ఆదిపురుష్‌’ సెట్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర?


మొన్నా మద్య ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సెట్ లో  భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. ఊహించని విధంగా అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు కానీ షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. 

Adipurush Set Fire Incident Happened Due To Conspiracy jsp
Author
Hyderabad, First Published Mar 4, 2021, 7:33 AM IST

మొన్నా మద్య ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సెట్ లో  భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. ఊహించని విధంగా అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు కానీ షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. 

సాధారణంగా సినిమా సెట్స్ వేసేటప్పుడు...అగ్నిప్రమాదాలనుంచి గానీ, షార్ట్‌సర్క్యూట్‌ వల్ల వచ్చే ప్రమాదాలను గానీ ముందుగానే ఊహించి దానికి తగిన చర్యలను తీసుకోవడం అతి సాధారణమైన విషయం. మరి అలాంటిది ఎందుకు ఆ విషయాన్ని నిర్మాతలు నిర్లక్ష్యం చేశారనేది ఎవరికీ అర్దం కాలేదు. దాంతో సినీ నిర్మాతలు, దర్శకుడు చర్చలు జరిపి, ఓ టీమ్‌ దానిపైన నిఘా పెట్టి, అసలుసిసలు కారణాలను అన్వేషించటం మొదలెట్టారు. ఆ అన్వేషణలో.. ఊహించని నిజాలు బయిటపడ్డాయని బాలీవుడ్ మీడియా అంటోంది.

 సైఫ్ ఆలీఖాన్ రావణ పాత్రను గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొందరికి నచ్చకపోవటమే ఈ ప్రమాదం లాంటి కుట్రకు కారణమంటున్నారు. సైఫ్ వ్యతిరేకులలో ఆగ్రహజ్వాలలు ఆరిపోలేదని, అందుకు ఈ అగ్నిప్రమాదమే నిదర్శనమని చెప్తున్నారు. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం రుజువులతో చూపలేదు. దాంతో అనుమానమే కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు.

అసలు సైఫ్ ఏమన్నారు..

7 వేల ఏళ్ల నాటి రామాయణ ఇతిహాసం ఆధారంగా తీయనున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అదే విధంగా... ప్రభాస్ కు విలన్ గా రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర టీమ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 7 వేల ఏళ్ల కింద ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు అంటూ ఈ సినిమాను నిర్మిస్తున్న టీ సిరీస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి విషయం తేల్చేసింది. ఇక లంకేశ్వరుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు అనగానే కొన్ని వర్గాల నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత అదీ సమిసిపోయింది. అయితే ఇప్పుడు మరో వివాదానికి ఈ తెర తీయబోతోందని అనిపిస్తోంది. అందుకు సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పిన మాటలే. 

‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్‌ తెలిపారు.

సైఫ్ మాటలని బట్టి అర్దం అయ్యిందేమిటంటే..ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమాలోనూ రావణుడిని క్రూరిడిగా, దుర్మార్గుడిగా చాలా పెద్ద విలన్‌గా చిత్రీకరించి చెబుతారు. అంతేకాకుండా రావణుడు అంటే భారీ కాయంతో, ఎంతో క్రూరంగా కనిపించేలా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం రావణుడిలోని మంచితనాన్ని చూపనున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా దర్వకుడు ప్రజలకు మరో కొత్త రామాయణాన్ని చూపించనున్నారని సైఫ్ చెప్పాడు.

ఈ చిత్రంలో కృతి సనన్‌ ‘సీత’ పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ‘అవతార్‌’, ‘స్టార్‌ వార్స్‌’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్స్‌తో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గ్రీన్‌ మ్యాట్‌ టెక్నాలజీపై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ఆగస్టు 11న, 2022లో విడుదల చేయనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios