యుంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ జోరు టాలీవుడ్ లో పెరుగుతోంది. భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడి హవా మొదలైంది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది.
యుంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ జోరు టాలీవుడ్ లో పెరుగుతోంది. భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడి హవా మొదలైంది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.
రీసెంట్ గా సార్ చిత్రంతో మరో విజయం దక్కించుకుంది. క్యూట్ లుక్స్ తో అందంగా కనిపించడంలో సంయుక్త మీనన్ స్టయిలే వేరు. ట్రెడిషనల్ గా అయినా మోడ్రన్ గా అయినా అదరగొడుతోంది. అయితే సంయుక్త మీనన్ గురించి, త్రివిక్రమ్ గురించి గత కొంతకాలంగా రూమర్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ వల్లే తనకి టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి అనే వాదనని గతంలో సంయుక్త ఖండించింది.
అలాగే వీరిద్దరిపై ఎఫైర్ రూమర్స్ కూడా వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హారిక అండ్ హాసిని, సితార ఎంటెర్టైమెంట్స్ సంస్థలు హోం బ్యానర్స్ లాగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ ఈ బ్యానర్స్ లో తప్ప ఇతర నిర్మాతలతో వర్క్ చేయడం లేదు. అలాగే త్రివిక్రమ్ హీరోయిన్లని రిపీట్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
సంయుక్త మీనన్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో నటించినప్పటికీ.. సితార నిర్మాణ సంస్థ అంటే మొత్తం చూసుకునేది త్రివిక్రమే. అందులో సందేహం లేదు. అలా భీమ్లా నాయక్ లో , సార్ చిత్రంలో సంయుక్తకి అవకాశాలు దక్కాయి అనే ప్రచారం జరుగుతోంది.
అయితే వీళ్లిద్దరి రిలేషన్ పై తాజాగా ఓ తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రివిక్రమ్, సంయుక్త మీనన్ మధ్య లవ్ ఎఫైర్ రూమర్స్ అని అర్థం వచ్చేలా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు తెలుగు బ్యూటీ రేఖా భోజ్. వైజాగ్ కి చెందిన ఈ యంగ్ బ్యూటీ దామిని విల్లా, రంగేలా లాంటి చిత్రాల్లో నటించింది.
హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. రేఖా భోజ్ తన ఫేస్ బుక్ పేజీలో.. చాలా కష్టపడుతున్నా గురూజీ.. ఆ మల్లు మీనన్ నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడానా దయచూడండి అంటూ పోస్ట్ చేసింది. మల్లు మీనన్ ఎవరని నెటిజన్లు అడగగా.. రీసెంట్ టైంలో గురూజీ చల్లని చూపు పడిన మలయాళీ యాక్ట్రెస్ మీనన్ అని తెలిపింది. రేఖా భోజ్ ఇలా టాప్ డైరెక్టర్ గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.