కోటీన్నరకు చేరువలో ఇన్స్టా ఫాలోవర్లు: శుభవార్త చెప్పి అంతలోనే, ఇదేంటీ పూజా
హీరోయిన్ పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని పూజా హెగ్డే తెలిపింది
కరోనా వైరస్ సెకండ్ వేవ్లో తాటతీస్తోంది. గత ఏడాది కంటే దారుణమైన పరిస్ధితులు దేశంలో నెలకొన్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వైరస్ బారినపడిన పడుతున్నారు. కరోనా కారణంగా ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ముఖ్యంగా సినీ పరిశ్రమలో కోవిడ్ విషాదం నింపుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇదే పరిస్దితి. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని పూజా హెగ్డే తెలిపింది. గతకొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. ప్రతిక్షణం తన వెంట ఉంటూ ప్రేమాభిమానాలు చూపిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
Also Read:కాజల్, సమంత, రష్మికల తర్వాత పూజాహెగ్డే.. ఫాలోవర్స్ కి ముద్దులు, హగ్గులు..
మరోవైపు ఇన్స్టాగ్రామ్లో తనను ఫాలో చేస్తున్నవారి సంఖ్య కోటీ 30 లక్షలు దాటడంతో వారికి పూజా హెగ్డే కృతజ్ఞతలు తెలిపారు. కానీ అంతలోనే కోవిడ్ సోకిందంటూ ఓ చెడు వార్తను షేర్ చేసి దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరోవైపు పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, చిరంజీవి ఆచార్య చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కోలీవుడ్లో ఇళయ దళపతి విజయ్ 65వ సినిమాలోనూ హీరోయిన్గా సెలక్ట్ అయ్యింది. అటు బాలీవుడ్లోనూ రణ్వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సర్కస్లోనూ నటించనుంది.