Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో కశ్మీర్ ఫైల్స్ నటి పల్లవి జోషికి ప్రమాదం.. తీవ్ర గాయాలు

సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ పాన్ ఇండియా చిత్రంగా ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు 'ది వాక్సిన్ వార్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

Actress Pallavi joshi met with accident in hyderabad
Author
First Published Jan 16, 2023, 9:05 PM IST

సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ పాన్ ఇండియా చిత్రంగా ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అనేక వివాదాలు సృష్టించినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు 'ది వాక్సిన్ వార్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సెట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ  ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలియజేసింది.

ది వాక్సిన్ వార్ లో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 'ది వాక్సిన్ వార్'ని విడుదల చేయనున్నారు.

గాయాలతోనే పల్లవి జోషి ఆ షాట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పల్లవి జోషి.. కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios