టాలీవుడ్ హీరోగా తన దైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.   

హీరోగా ఒకప్పుడు ఊపూపిన నటుడు శ్రీకాంత్  ఇటీవల కాలంలో తన కేరీర్ గ్రోత్ కోసం రూటు మార్చిన విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా ప్రస్తుతం విలన్ పాత్రల్లో కనిపిస్తూ కూడా మెప్పిస్తున్నారు. ఆడియోన్స్ తో చప్పట్లు కొట్టిస్తున్నారు. 

తన సినిమాల్లో  ఇన్నోసెంట్ గా, లవర్ బాయ్ గా కనిపించే శ్రీకాంత్ కూడా ప్రస్తుతం నెగటివ్ రోల్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారనిపిస్తోంది. 1991లో ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’మూవీతో తెలుగు ఆడియెన్స్ దగ్గరయ్యాడు శ్రీకాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘అబ్బాయి గారు’, ‘రథ సారథి’, ‘ఆమె’, ‘పెళ్లి సందడి’, ‘పండగ’, ‘పిల్ల నచ్చింది’ ‘ఏవండో శ్రీవారు’ వంటి చిత్రాలు  హిట్ గా నిలిచాయి. 

హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన  ‘శ్రీకాంత్’ ప్రస్తుతం విలన్ గా దర్శనమిస్తున్నాడు. ఇటీవల నందమూరి బాలక్రిష్ణ ‘అఖండ’తో సెన్సెషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో  శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.  అంతకు ముందు యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా నటించాడు శ్రీకాంత్.

కాగా, కరోనా పరిస్థితులను హీరో అయినా, విలనైనా ఎదుర్కొక తప్పడం లేదు. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిపడుతున్నారు. తాజాగా నటుడు శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. రెండు మూడు రోజుల నుంచి కరోనా సిమ్టస్స్ కనిపించగా టెస్ట్ చేస్తే పాజిటివ్ గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తను స్వీయ నిర్భంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

 

Scroll to load tweet…

అయితే, తనను ఇటీవల ఎవరైనా కలిఉంటే వెంటనే ఐసోలేట్ కావాలని సూచించారు. వీలైనంత త్వరగా కరోనా టెస్ట్ చేయించుకొని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ ఉదయమే మెగా స్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన కూడా స్వీయ నిర్బందంలో ఉన్నారు.