సినీ నటుడు శరత్ కుమార్కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ప్రముఖ సినీ నటుడు శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చైన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రముఖ సినీ నటుడు శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చైన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన డయేరియాతో డీహైడ్రేషన్కు గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య రాధిక, కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.