సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా హెల్త్ అప్డేట్ ఇదే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య నిలకడగానే ఉన్నదని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో రెస్టు తీసుకుంటున్నట్టు బంధువు, నటుడు వైజీ మహేంద్రన్ వెల్లడించారు. అన్నాత్తే సినిమా విడుదలకు ముందే బహుశా రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అవుతారని చెప్పారు. రజనీ నటించిన అన్నాత్తే సినిమా వచ్చే నెల 4వ తేదీన దీపావళి పండుగ రోజునే విడుదల కానుంది.
చెన్నై: సూపర్ స్టార్ Rajinikanth గురువారం రాత్రి హఠాత్తుగా Hospitalలో Admit కావడం ఆయన అభిమానుల్లో ఆందోళనలు కలుగజేసింది. ఆయన Health Update కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా, హాస్పిటల్లో తలైవాను పరామర్శించి వచ్చిన ఆయన బంధువు, నటుడు వైజీ మహేంద్రన్ ఈ విషయంపై స్పందించారు. రజనీకాంత్ ఆరోగ్య నిలకడగానే ఉన్నదని ఆయన ధ్రువీకరించారు. ప్రస్తుతం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన నటించిన సినిమా ‘అన్నాత్తే’ విడుదలకు ముందే హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జీ అయ్యే అవకాశముందని వివరించారు.
మీడియాతో మహేంద్రన్ మాట్లాడుతూ, ‘రజనీకాంత్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్య Stableగానే ఉన్నది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు ఏం చికిత్స అందిస్తున్నారో తెలియదు. కానీ, ఆయన బాగానే ఉన్నారు. అన్నాత్తే సినిమా విడుదలకు ముందే ఆయన డిశ్చార్జ్ అవుతారు’ అని తెలిపారు.
Also Read: Breaking news: ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు
చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో రజనీకాంత్ కేవలం రోటీన్ చెకప్ కోసమే అడ్మిట్ అయ్యారని సన్నిహితవర్గాలు తెలిపాయి. రజనీకాంత్ పబ్లిసిస్ట్ రియాజ్ కే అహ్మద్ మాట్లాడుతూ, ‘ఇది రోటీన్గా చేసుకునే హెల్త్ చెకప్ మాత్రమే. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు హాస్పిటల్లో చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు’ అని వివరించారు. రజనీకాంత్కు నాలుగు రోజులపాటు చికిత్స అందించే అవకాశముందని మరికొన్ని వర్గాలు తెలిపాయి.
కావేరీ హాస్పిటల్ ప్రతినిధి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ‘రజనీకాంత్కు పరీక్షలు చేస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ఇది కేవలం రెగ్యులర్ చెకప్లో భాగమే’ అని తెలిపారు. రజనీకాంత్తోపాటు హాస్పిటల్లో ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య ధనుశ్, రవిచందర్లు ఉన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లతా రజనీకాంత్ ఇది వరకే తెలిపారు.
బీపీలో ఒడిదుడుకులతో గతేడాది డిసెంబర్లో రజనీకాంత్ హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజనీకాంత్.. తన ఫ్రెండ్.. బస్ డ్రైవర్కు అవార్డు అంకితం
అన్నాత్తే సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం రజనీకాంత్ ఆయన కుటుంబ సభ్యులతోపాటుగా గురువారం హాజరయ్యారు. దీపావళి సందర్భంగా వచ్చే నెల 4వ తేదీన అన్నాత్తే సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
70ఏళ్ల యాక్టర్ రజనీకాంత్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ చలనచిత్ర అవార్డు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ఆయన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డుల కార్యక్రమానికి రజనీకాంత్, ఆయన కూతురు, అల్లుడు, ఐశ్వర్య, ధనుశ్లతో కలిసివెళ్లారు. అవార్డు స్వీకరించిన తర్వాత రజనీకాంత్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను కలిసి తిరిగి వచ్చారు. ఆయన అల్లుడు ధనుశ్ కూడా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. అసురన్ చిత్రంలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.