Asianet News TeluguAsianet News Telugu

విషాదంః కరోనాతో ప్రముఖ దర్శక, నటుడు ఆర్ఎన్‌ఆర్‌ మనోహర్‌ కన్నుమూత

ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌.. నటుడిగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `మాసిలమణి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

actor director rnr manohan passed away due to corona
Author
Hyderabad, First Published Nov 17, 2021, 4:23 PM IST

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌(54)(RNR Manohar) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రి పాలయ్యారు. గత 20 రోజులుగా కరోనాతో పోరాడుతూ చివరికి ఈ రోజు(బుధవారం) ఉదయం RNR Manohar కన్నుమూశారు. మనోహర్‌ మరణంపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌.. నటుడిగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `మాసిలమణి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఇందులో నకుల్‌, సునైనా జంటగా నటించారు. ఈ సినిమా మంచి కమర్షియల్‌ హిట్‌తోపాటు ప్రశంసలందుకుంది. ఇక 1994లో `మైందన్‌` చిత్రంతో కో డైరెక్టర్గా, రైటర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు మనోహర్‌.  ప్రముఖ దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆయన వద్ద `బ్యాండ్‌ మాస్టర్‌`, `సూరియన్‌ చంద్రన్‌` చిత్రాలకు వర్క్ చేశారు. ఈ క్రమంలో 2009లో `మాసిలమణి` చిత్రంతో దర్శకుడిగా మారారు. 

అంతకంటే ముందు 1995లో `కోలంగల్‌` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు 45 చిత్రాల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో నాగచైతన్య నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంలో హీరోకి తండ్రి పాత్రలో నటించారు మనోహర్. నటుడిగా `కళ్లజాగర్‌`, `ధిల్‌`, `సుత్తా పజమ్‌`, `యా యా`, `వీరం`, `కాలా కూతు`, `విశ్వాసం`, `అయోగ్య`, `ఖైదీ`, `కాప్పాన్‌`, `భూమి` చిత్రాల్లో నటించారు. చివరగా ఆర్య,సాయేషా నటించిన `టెడ్డీ `చిత్రంలో నటించారు మనోహర్. రైటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా తమిళనాట విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ మరణంగా కోలీవుడ్‌కి తీరని లోటని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios