pushpa: ‘పుష్ప’...నేపాల్ కలెక్షన్స్, టాక్ విన్నారా?! షాకే
డిసెంబర్17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా.. జనవరి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పుష్ప’ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ‘పుష్ప’ అన్ని చోట్ల మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ ని సాధిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. హిందీ లో పుష్ప హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ లోనే నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నేపాల్ లో కూడా ఈ సినిమా హవా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. హౌస్ ఫుల్స్ తోనే థియేటర్స్ కి జనాన్ని రప్పించి ఆదరగొడుతోంది. నేపాల్ లో జనం ఎలా చూస్తున్నారు అనే దానికి సంబంధించి కొన్ని వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దీనితో అల్లు అర్జున్ ఫఅయాన్స్ ...పుష్ప క్రేజ్ నేపాల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని అంటున్నారు. ఇప్పటిదాకా అక్కడ 12 కోట్లు అంటే ఇండియన్ కరెన్సీలో 8 కోట్లు సాధించిందని చెప్తున్నారు. ఇక నుంచి అల్లు అర్జున్ ప్రతీ సినిమాని అక్కడ భారీ స్దాయిలో రిలీజ్ చేయచ్చు అంటున్నారు.
మరో ప్రక్క ఈ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీకి తీసుకొచ్చారు. ‘పుష్ప’ సినిమా మొన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.ఈ సినిమాని అమేజాన్ బాగా ప్రమోట్ చేస్తోంది. డిసెంబర్17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా.. జనవరి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పుష్ప’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 22వ రోజుకే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. హిందీ మినహాయించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప-ది రూల్’ ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.