ఈ అప్ డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్కు ఆశ్చర్యం, ఆనందం
ప్రభాస్ ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. కరోననాతో బ్రేక్ పడింది. దాంతో తాజాగా ప్రభాస్ 20 సినిమా కోసం ఓ లావిష్ సెట్ ని హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో ప్రక్క దర్శకుడు తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సెట్ ఓ లావిష్ హాస్పటిల్ సెట్ అని తెలుస్తోంది.
ఇంకెంత కాలం ఆగుతాం..షూటింగ్ లు మొదలెడదాం అనే ధోరణి సినిమా వాళ్లలో మొదలైంది. సాధ్యమైనన్ని జాగ్రత్తలతో షూటింగ్ లు చేసుకుందాం అని డిసైడ్ అవుతున్నారు. అయితే ఇతర దేశాలు, అవుట్ డోర్ లొకేషన్స్ కుదరవు కాబట్టి తమ సినిమాలకు సెట్స్ వేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. కరోననాతో బ్రేక్ పడింది.
దాంతో తాజాగా ప్రభాస్ 20 సినిమా కోసం ఓ లావిష్ సెట్ ని హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో ప్రక్క దర్శకుడు తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సెట్ ఓ లావిష్ హాస్పటిల్ సెట్ అని తెలుస్తోంది.
ఈ హాస్పటిల్ సెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు వరకూ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ హాస్పటిల్ సెట్..నాలుగు ప్లోర్ లు కలిగి ఉంటుంది. అలాగే ఐసీయు వార్డ్, స్పెషల్ వార్డ్ , జనరల్ వార్డ్, డాక్టర్ రూమ్స్ రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లో దాదాపు ఓ నెల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాసం ఉంది. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
అలాగే ప్రభాస్ కొత్త సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రాధేశ్యాయ్ అనే టైటిల్ని చిత్రానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.
ఇక బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్గా మారాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సాహో సినిమా ఆశించిన స్థఆయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోవడంతో.. ఇప్పడు తన కొత్త సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ తన 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.