‘ఆది పురుష్’ గ్రాఫిక్స్ పై అంత ఖర్చా? మొత్తం బడ్జెట్ ఎంత
ప్రభాస్ డైరక్ట్ గా బాలీవుడ్లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని చూస్తుంటే ఇదొక మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉండే చిత్రంగా అర్థమవుతుంది.
ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నీ గ్రాఫిక్స్ మీద ఆధారపడి నిర్మాణమవుతున్నాయి. భారీతనం అంతా గ్రాఫిక్స్ బడ్జెట్ లోనే ఉంటోంది. తాజాగా ప్రభాస్ డైరక్ట్ గా బాలీవుడ్లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని చూస్తుంటే ఇదొక మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉండే చిత్రంగా అర్థమవుతుంది. ఓ పక్క ఆంజనేయుడు, మరో పక్క బాణం సంధిస్తున్న రాముడు, పది తలల రావణాసురుడు ఉండటంతో రామాయణం ఇతివృత్తంగా, చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా ఈ సినిమా ఉంటుందని తెలియజేస్తోంది. అదే సమయంలో ఈ సినిమా గ్రాఫిక్స్ బడ్జెట్ కూడా ఓ రేంజిలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 250 కోట్ల భారీ బడ్జెట్ ని గ్రాఫిక్స్ కోసం పెట్టనున్నారట. అంతా గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ తో నిండి ఉంటాయి. అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు వరకూ అవుతుందని, త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది.
అలాగే “ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? అంటే..రాముడిగా ప్రభాస్ నటించబోతున్నాడని, ఆ దేవుడి పాత్రలో అతికొద్దిమంది నటులు మాత్రమే రాణించారన్నట్లుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తేల్చాసాడు.