‘ఆచార్య’ షూట్ పెండింగ్ పై కొరటాల శివ
రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా రకరకాల కారణాలతో షూటింగ్ మొదలవటం,ఆగటం అన్నట్లుగా సాగుతోంది. ఈ మధ్యనే కరోనా సెకండ్ వేవ్ తో ఏప్రియల్ లో షూటింగ్ ఆగింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా రకరకాల కారణాలతో షూటింగ్ మొదలవటం,ఆగటం అన్నట్లుగా సాగుతోంది. ఈ మధ్యనే కరోనా సెకండ్ వేవ్ తో ఏప్రియల్ లో షూటింగ్ ఆగింది.
మూడేళ్లుగా ఈ చిత్రం పనిలోనే ఉన్న కొరటాల శివ ఈ సినిమాని ఈ సంవత్సరం పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందని,గుమ్మిడికాయ కొట్టడానికి ఇంకా టైమ్ ఉందని దర్శకుడు కొరటాల శివ అఫీషియల్ గా మీడియాకు తెలియచేసారు, ఈ పార్ట్ని కరోనా కంట్రోలులోకి రాగానే జూలైలో మొదలెట్టి పూర్తి చేయాలనుకుంటున్నాడు. దానికి సంబంధించి రామ్ చరణ్, హీరోయిన్స్ కాజల్, పూజాహెగ్డె షూటింగ్లో పాల్గనాల్సి ఉంది.
ఇక చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చిత్రంలో సోనూ సూద్, అజయ్, తనికెళ్ల భరణి, కిశోర్ తదితరులు నటిస్తున్నారు.