#Prabhas:ప్రభాస్ కోసం 10 కోట్లతో పాత థియోటర్
అది ఇప్పుడు వాడుకలో లేని పాత థియేటర్ సెట్ అని తెలుస్తోంది. సినిమా అంతా పూర్వీకుల థియేటర్ చుట్టూనే తిరుగుతుందని చెప్తున్నారు.
ప్రభాస్-మారుతి కాంబినేషన్లో సినిమా ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. చడీ చప్పుడు, ఓపినింగ్ లేకుండా మొదలెట్టిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా కోసం 10 కోట్ల రూపాయల థియేటర్ భారీ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం. చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ థియేటర్ సెట్ను నిర్మించినట్లు తెలుస్తుంది.
అది ఇప్పుడు వాడుకలో లేని పాత థియేటర్ సెట్ అని తెలుస్తోంది. సినిమా అంతా పూర్వీకుల థియేటర్ చుట్టూనే తిరుగుతుందని చెప్తున్నారు. ఇది హారర్-కామెడీ సబ్జెక్టు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు, మేకర్స్ తదుపరి షెడ్యూల్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ షెడ్యూల్ కోసం ప్రభాస్ కేవలం వారం రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట. ఈ షెడ్యూల్లో ప్రభాస్, సంజయ్ దత్ మధ్య సన్నివేశాలను చిత్ర టీమ్ తెరకెక్కించనుందట. సంజయ్ దత్ ని ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు టాక్.
మారుతి, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ను కొత్తగా డిజైన్ చేశాడని సమాచారం. ఫ్యాన్స్ రేంజ్ ఎలివేషన్లు, ప్రేక్షకులకు కావలిసిన కామెడీ సీన్లు ఇలా అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాను మారుతి ‘రాజా డిలక్స్’ అనే థియేటర్ చుట్టు తిరిగే తాత-మనవళ్ళ కథతో రూపొందించనున్నాడట. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ నటించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.