ఫైనల్ గా 'ఎవరు' ఎంత కలెక్ట్ చేసింది (ఏరియావైజ్)
‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో పోస్టర్ వేస్తే జనాలను రప్పించుకునే ఇండిడ్యువల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. తాజాగా‘ఎవరు’ చిత్రంతో మరోసారి తనను నమ్మి థియోటర్ కు వచ్చిన వాళ్లకు వంద శాతం టిక్కెట్ గిట్టుబాటు చేస్తాననిపించాడు.
మరో మూడు రోజుల్లో మొత్తం థియోటర్స్ ని సాహో కబ్జా చేయనుంది. ఈ నేపధ్యంలో గురువారంతో దాదాపు ప్రతీ సినిమా తిరుగు ప్రయాణం పెట్టుకోనుంది. అందులో భాగంగానే ఇప్పటికి రన్ ఉన్న `ఎవరు` సినిమా సైతం బిజినెస్ క్లోజ్ చేయనున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేసింది. ఏ రేంజి హిట్ అనేది హాట్ టాపిక్ గా మారింది.
‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో పోస్టర్ వేస్తే జనాలను రప్పించుకునే ఇండిడ్యువల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. తాజాగా‘ఎవరు’ చిత్రంతో మరోసారి తనను నమ్మి థియోటర్ కు వచ్చిన వాళ్లకు వంద శాతం టిక్కెట్ గిట్టుబాటు చేస్తాననిపించాడు. ఈ చిత్రంతో అడవి శేషు తన కెరియర్ హయ్యెస్ట్ వసుళ్లను రాబట్టారు.
ఓ రీమేక్ గా , అతి చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలు ఊహించని స్థాయి కలెక్షన్లు రాబట్టింది. మొదటి రెండు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.75 కోట్ల షేర్తో డిస్ట్రిబ్యూటర్స్కి హ్యాపీ ఫీస్ట్ ఇవ్వగా... మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. అక్కడ నుంచి వరసపెట్టి వచ్చినదంతా లాభామే. ఇప్పటివరకూ కలెక్ట్ చేసిన షేర్ 9.83 కోట్లు. ఏరియా వైజ్ గా ఆ లెక్కలు చూద్దాం.
ఏరియా షేర్ (కోట్లలో)
-------------------- ----------------------------------------
నైజాం 3.40
సీడెడ్ 0.82
నెల్లూరు 0.18
కృష్ణా 0.61
గుంటూరు 0.49
వైజాగ్ 1.07
ఈస్ట్ గోదావరి 0.53
వెస్ట్ గోదావరి 0.33
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 7.43
భారత్ లో మిగతా ప్రాంతాలు 0.85
ఓవర్ సీస్ 1.55
ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ 9.83