Asianet News TeluguAsianet News Telugu

నిత్యామీనన్ సైతం ఆ ప్రపంచంలోకి అడుగెట్టింది!

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇండియా మార్కెట్లో ప్రవేశించాక డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది. రెగ్యులర్ గా చేసే ఫీచర్‌ ఫిల్మ్స్‌తో పాటుగా వెబ్ సీరిస్ లు  కూడా పోటీ పడుతున్నాయి.

'Breathe' offers me large canvas to exhibit my talent
Author
Hyderabad, First Published Feb 11, 2019, 9:29 AM IST

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇండియా మార్కెట్లో ప్రవేశించాక డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది. రెగ్యులర్ గా చేసే ఫీచర్‌ ఫిల్మ్స్‌తో పాటుగా వెబ్ సీరిస్ లు  కూడా పోటీ పడుతున్నాయి. నటులు కూడా ఫీచర్‌ని, డిజిటల్‌ని వేరు వేరుగూ చూడటం . అవకాశాన్ని బట్టి  ఏది వీలుంటే అందులో నటించేస్తున్నారు. తాజాగా నిత్యామీనన్‌ కూడా వెబ్ సీరిస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అమేజాన్‌ రూపొందిస్తున్న ‘బ్రీత్‌’ సీజన్‌ 2లో లీడ్‌ రోల్‌లో కనిపించనున్నారామె. ఈ సీజన్ 2 లో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటించనున్నారు.

నిత్య మాట్లాడుతూ– ‘‘బ్రీత్‌’ నా తొలి డిజిటల్‌ షో. ఇలాంటి థ్రిల్లింగ్‌ సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌లకు ఇలాంటి సిరీస్‌లు చాలా ఫర్పెక్ట్‌ అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కి చాలా సమయం ఉంటుంది. ప్రతి పాత్రను లోతుగా ఆవిష్కరించవచ్చు. డిజిటల్‌ సిరీస్‌లో కంటెంట్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వక్కర్లేదు కూడా’’ అంటున్నారామె. 

అలాగే ‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్‌ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్‌ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్‌ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నా షూటింగ్‌ పూర్తికావొచ్చింది. బ్రీత్‌ వెబ్‌సిరీస్‌ ‘బ్రీత్‌ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు.

ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్‌. కేవలం సౌత్ సినిమాలే కాక బాలీవుడ్ ప్రాజెక్ట్ ల పైనా దృష్టి పెట్టారు.  ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నిత్యామీనన్‌ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios