ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల WeWantPSPK26Update అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ కూడా చేశారు. 

కానీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, దిల్ రాజు మాత్రం స్పందించడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ఆసక్తికర ప్రకటన చేశాడు. పవన్ కళ్యాణ్ ని కలసిన తర్వాత తమన్ ఈ ప్రకటన చేయడం విశేషం. పవన్ ని కలసిన తమన్ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

ఆ విషయంలో బాలయ్య, ట్రంప్ కిరాక్ అంతే.. కాపీ కొట్టడం అసాధ్యం!

'ఇది అద్భుతమైన రోజు. నేను కలవాలని, ఆయన చిత్రాలకు సంగీతం అందించాలని కలలు కన్న వ్యక్తిని కలిశాను. నేను కంపోజ్ చేసిన పాటలని ఆయనకు వినిపించాను. ఆ సమయంలో టెన్షన్ కు గురయ్యా. ఆయనపై ఉన్న ప్రేమ నేను ఒత్తిడికి గురయ్యేలా చేసింది. కానీ ఆయన కూడా నాపై ప్రేమాభిమానాలు చూపించారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ తో రాబోతున్నాం' అని తమన్ ప్రకటించాడు. 

Scroll to load tweet…

వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ లాయర్ గెటప్ లో కనిపించబోతున్నాడు. నివేత థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ ని కలిసిన నితిన్, భీష్మ డైరెక్టర్.. దిల్ రాజు వల్లే(ఫోటోస్)