ఖైదీ చిత్రానికి అరుదైన గౌరవం
కార్తీ నటించిన చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. `ఖైదీ` సినిమా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తమిళ హీరో కార్తి నటించిన `ఖైదీ` చిత్రం గతేడాది బ్లక్బస్టర్గా నిలిచింది. పాటలు, హీరోయిన్ లేని యాక్షన్ ఎంటర్టైనర్ పూర్తిగా థ్రిల్లింగ్ అంశాలతో సాగి ఘన విజయం సాధించింది. అటు తమిళంలోనే కాదు, తెలుగులోనూ విశేష ఆదరణ పొందింది. కార్తికి ఓ కొత్త రకమైన ఇమేజ్ని తీసుకొచ్చింది. కమర్షియల్గా భారీ కలెక్షన్లని కూడా రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 9 నుంచి 15 వరకు ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని కెనడాలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. తమ చిత్రానికి ఇంత గౌరవం దక్కడంపై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో నాని నటించిన 'జెర్సీ' కూడా ఎంపికైన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ నటించిన `సూపర్ 30` ఎంపిక కావడం విశేషం.