Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ తో హీరోయిన్ తండ్రి మృతి, భయాందోళనలో సినిమా ఇండస్ట్రీ

తాజాగా హీరోయిన్ తన తండ్రిని ఈ వైరస్ సోకడం వల్ల కోల్పోయింది. ఆమె ఇలా తండ్రిని కోల్పోవడంతో యావత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సంతాపం తెలిపినప్పటికీ... ఈమె గనుక తండ్రిని కలిసిందా, ఆ తరువాత షూటింగ్లకు వచ్చిందా అని ఆమె కో స్టార్స్, టెక్నిషన్స్ అందరూ వణికిపోతున్నారు. 

Heroine's father dies of coronavirus, Industry grips in fear
Author
New York, First Published Mar 23, 2020, 2:39 PM IST

ప్రపంచంలో కరోనా వైరస్ దెబ్బకు జనాలు ఎవర్ని కలవాలన్నా వణికిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని కోరుతోంది. 

ఈ వైరస్ కి పేద, ధనిక, తన పర, మతం, కులం అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. దేశాధినేతల నుండి మొదలు సినిమా స్టార్ల వరకు ఎవ్వరైనా ఈ వైరస్ కి దాసోహం అనాల్సిందే. 

తాజాగా హీరోయిన్ తన తండ్రిని ఈ వైరస్ సోకడం వల్ల కోల్పోయింది. ఆమె ఇలా తండ్రిని కోల్పోవడంతో యావత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సంతాపం తెలిపినప్పటికీ... ఈమె గనుక తండ్రిని కలిసిందా, ఆ తరువాత షూటింగ్లకు వచ్చిందా అని ఆమె కో స్టార్స్, టెక్నిషన్స్ అందరూ వణికిపోతున్నారు. 

వివరాల్లోకి వెళితే... హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తన తాండ్ర పీటర్ మైల్స్ కరోనా ఓ=ఇరుసు వల్ల ప్రాణాలు కోల్పోయారని ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన కరోనా వైరస్ కి గురయ్యి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నప్పటికీ... ఆయన ఆ వైరస్ ను దాటుకొని బయటకు రాలేకపోయారు. 

వైరస్ ఆయనను బలితీసుకుంది. ఇలా కరోనా వైరస్ తో తన తండ్రితో మరణించాడని చెప్పగానే యావత్ సినీలోకం దిగ్బ్రఅంతికి గురయ్యి వణికిపోతుంది. ఆమె ఎవరెవర్ని కలిసిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆమె తన తండ్రిని వైరస్ సోకినప్పుడు కలిసిందా లేదా అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. 

ఇకపోతే, తెలంగాణలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య 30కి చేరుకుంది. సోమవారం ఒక్కరోజే ముగ్గురు కరోనా పాజిటివ్ కు గురైనట్లు తేలింది. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అలాగే, ఫ్రాన్స్ నుంచి వచ్చి 21 ఏళ్ల యువకుడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. అలాగే, కరీంనగర్ లో ఇండోనేషియా పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికి కరోనా సేకింది.

ఇటీవల ఇండోనేషియా నుంచి ఓ బృందం కరీంనగర్ వచ్చింది. వారితో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. అతన్ని కరీంనగర్ నుంచి సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనితో కలిసి తిరిగినవారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. 

Photos: కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ

ఇళ్లలోంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇండోనేషియా నుంచి ఇటీవల 11 మంది మతప్రచారకులు వచ్చారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

వారంతా క్రాంతి సంపర్క్ రైలులో రామగుండం చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఆటోలో కరీంనగర్ చేరుకున్నారు. దాంతో కరీంనగర్ లో తీవ్ర కలకలం చెలరేగింది. ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. 

Also Read: తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే...

ఆ పరిస్థితుల్లో కరీంనగర్ లో ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. ఇంటింటికీ వైద్యం బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. రంగంలోకి 100 వైద్య బృందాలు దిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios